హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. షార్జా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద బంగారం, ఐఫోన్లు, పర్ఫ్యూమ్ బాటిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, ఐఫోన్లు, పర్ఫ్యూమ్ బాటిల్స్ విలువ రూ. 17,69,256 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఇద్దరి ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.