హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మరికాసేపట్లో గాంధీ దవాఖానకు వెళ్లనున్నారు. కొవిడ్ బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. దవాఖానలో కొవిడ్ చికిత్స, సదుపాయాలపై అధికారులతో సమీక్షించనున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. సీఎం రాక నేపథ్యంలో గాంధీ దవాఖాన వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.