హైదరాబాద్, డిసెంబర్ 18, (నమస్తే తెలంగాణ): ఇబ్రహీంపట్నం కోర్టు మేజిస్ట్రేట్, న్యాయవాదుల పట్ల అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణల మేరకు న్యాయవాది ఎం శ్రీనివాస్పై నమోదైన క్రిమినల్ కేసు వివరాలను అందజేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిరుడు డిసెంబర్ 19న ఇబ్రహీంపట్నం 16వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చేసిన ఫిర్యాదును హైకోర్టు సుమోటోగా పరిగణించింది. దీనిపై సీజే అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. శ్రీనివాస్పై పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసు వివరాలివ్వాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.