మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల నియోజక వర్గం నుంచి తెలంగాణ శాసన మండలి సభ్యుని ఎన్నికకు సోమవారం నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి. గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన ఒంటెరి యాదవ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.
అలాగే సంగారెడ్డి నియోజక వర్గానికి చెందిన బోయిని విజయలక్ష్మి, మెదక్ నియోజక వర్గానికి చెందిన ఐరేణి సత్యనారాయణ గౌడ్, గజ్వేల్ నియోజక వర్గానికి చెందిన సాయిబాబా చింతల స్వతంత్ర అభ్యర్థులుగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరీష్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్లు ప్రారంభమైన 16 నుంచి నేటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి మొత్తం ఐదు మంది అభ్యర్థులునామినేషన్లు దాఖలు చేశారు.