Swaroopanandendra swamy | మణికొండ, మే 7: రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్తు కోతలు, నీటికొరత లాంటి సమస్యలెన్నో తెలంగాణను వెంటాడుతాయని అంతా భావించారని, కానీ సీఎం కేసీఆర్ చతురతతో, రాజశ్యామల అమ్మవారిని ఆరాధించడం ద్వారా అచిరకాలంలోనే వాటన్నింటినీ అధిగమించారని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ అన్నారు.
నేడు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ శివారులోని కోకాపేటలో విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో చేపట్టిన రాజశ్యామల అమ్మవారి ఆలయ నిర్మాణానికి ఆదివారం పీఠం ఉత్తరాధిపతి స్వాత్మానందేంద్ర స్వామీజీతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. దాదాపు 8 కోట్ల వ్యయంతో కాకయతీయు ల శిల్పకలా నైపుణ్యంతో ఆలయ నిర్మాణం రూపుదిద్దుకోనున్నది.
తెలంగాణలో రాజశ్యామల అమ్మవారు ఆవిర్భవించాలనే సదుద్దేశంతోనే సీఎం కేసీఆర్ తమ పీఠానికి రెండెకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, ఎమ్మెల్యే సతీశ్కుమార్, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, కంపెనీస్ లా ట్రిబ్యునల్ న్యాయమూర్తి బద్రీనాథ్, ఫొన్సిక్స్ ప్రతినిధి చుక్కపల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.