హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నూతన ఆవిషరణలను ప్రోత్సహిస్తూ విద్యార్థులను యువ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) స్టార్టప్ టూర్ చేపట్టింది. టూర్లో భాగంగా ఉమ్మడి 10 జిల్లాలకు చెందిన 15 కాలేజీల నుంచి 500 మంది విద్యార్థులు, అధ్యాపకులు శనివారం టీ హబ్ను సందర్శించారు.
స్టార్టప్ల నిర్వాహకులతో ముచ్చటించి అనేక అంశాలపై చర్చించారు. టూర్లో పాల్గొన్న కాలేజీల విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. టీహబ్ సందర్శన కోసం డిసెంబర్ 16న మరోసారి స్టార్టప్ టూర్ చేపడుతామని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు(bit.ly/ titastartuptour) లింకులో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 6300368705 / 8123123434 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.