హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : టెట్ క్వాలిఫై కావాలన్న నిబంధనతో వేలాది మంది టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ(ఆర్యూపీపీ టీఎస్) ఆవేదన వ్యక్తంచేసింది. 2010కి పూర్వం నియమితులైన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది. సంఘం ప్రతినిధులు శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
21వేల మంది టీచర్లకు ఉపశమనం కల్పించాలని.. అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సంఘం నేతలు కోరారు. టెట్ పేపర్-2 అశాస్త్రీయంగా ఉన్నదని, ఈ పేపర్లో మార్పులు చేయాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడు శానమోని నర్సింహులు, గౌరవాధ్యక్షుడు ఎంఎన్ విజయ్కుమార్ తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.