హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): విమానాల ఆన్లైన్ టికెట్ బుకింగ్లో ఉండే ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానాన్ని దేశంలో తొలిసారిగా ఆర్టీసీలో అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్ట్గా హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ఈ నెల 27 నుంచి 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది. హైదరాబాద్లోని బస్భవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో డైనమిక్ ప్రైసింగ్ విధాన వివరాలను టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో ఈ నెల 27 నుంచి ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ప్రకటించారు. విమానాలు, హోటళ్లు, ప్రైవేట్ బస్ ఆపరేటర్ల బుకింగ్లో ఇప్పటికే అమల్లో ఉన్న డైనమిక్ ప్రైసింగ్ను త్వరలోనే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయమున్న సర్వీస్లన్నింటిలో అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికుల రద్దీ ఆధారంగా టికెట్ ధరల్లో హెచ్చుతగ్గులు జరగడమే డైనమిక్ ప్రైసింగ్ విధానం. రద్దీ తకువగా ఉంటే సాధారణ చార్జీ కంటే తకువగా, డిమాండ్ ఎకువగా ఉంటే ఆ మేరకు చార్జీలు ఉంటా యి. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో అడ్వాన్స్డ్ డాటా అనాలసిస్ అండ్ మెషిన్ లర్నిం గ్ అల్గారిథమ్స్ మారెట్లోని డిమాండ్కు అనుగుణంగా చార్జీలను నిర్ణయిస్తాయి.
ప్రైవే ట్ ఆపరేటర్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సుల బుకింగ్లతో పోల్చి టికెట్ ధరను వెల్లడిస్తాయి. సాధారణ రోజుల్లోనూ ప్రైవేట్ ఆపరేటర్లు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని, రద్దీ రోజుల్లో అయితే టికెట్ల ధరలు ఇష్టారీతిన పెంచుతున్నారని బాజిరెడ్డి, సజ్జనార్ తెలిపారు. డైనమిక్ ప్రైసింగ్ విధానం వల్ల రద్దీ తకువగా ఉన్నప్పుడు సాధారణ చార్జీ కన్నా 20 నుంచి 30 శాతం వరకు టికెట్ ధర తకువగా ఉంటుందని, రద్దీ ఎకువగా ఉంటే సాధారణ చార్జీ కన్నా డిమాండ్ అనుగుణంగా 25 శాతం వరకు ఎకువగా ఉంటుందని వివరించారు. రద్దీ తకువగా ఉన్న రోజుల్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు డైనమిక్ ప్రైసింగ్ విధానం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, సీనియర్ సిటిజన్లు, పెన్షన్దారులకు కల్పించే రాయితీల్లో మార్పు ఉండదని పేర్కొన్నారు.