ఆదిబట్ల, ఏప్రిల్ 4 : డ్రగ్స్కు బానిసైన ఓ యువకుడు కన్నతండ్రిని అత్యం త దారుణంగా హతమార్చాడు. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఆపై తలపై బండరాయితో మోది హత్యచేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ఠాణా పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. సీఐ రాఘవేందర్రెడ్డి కథనం ప్రకారం.. తుర్కయాంజాల్ పట్టణ పరిధిలోని ఆరెంజ్ అవెన్యూకాలనీకి చెందిన తిరుపతి రవీందర్(60), సుధ దంపతులు.
వీరికి ఇద్దరు కుమారులు. రవీందర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా.. పెద్ద కుమారుడు అనురాగ్ మత్తు పదార్థాలకు అలవాటు పడి.. తరచూ కుటుం బ సభ్యులతో గొడవ పడేవాడు. గురువారం మధ్యాహ్నం తల్లి ఓ గదిలో ఉం డగా తాళం వేసిన అనురాగ్ తండ్రితో గొడవపడ్డాడు. తండ్రిపై పెట్రోల్ పోసేందుకు యత్నించగా అతడు భయంతో బయటికి పరుగులు తీశాడు. వెంబడిం చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తలపై బండరాయితో మోది హత్య చేశాడు. పోలీసులు ఘటనాస్థలికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.