హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏఐఎఫ్జీడీఏ) జాతీయ సమన్వయకర్తగా నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ కిరణ్ మాదాల ఎన్నికయ్యారు. ఇటీవల ముంబైలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
జాతీయ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేశ్ గైక్వాడ్ను ఎన్నుకున్నారు. డాక్టర్ కిరణ్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా దవాఖానలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర మీడియా సమన్వకర్తగా వ్యవహరిస్తున్నారు. 2017 నుంచి ఈసీ మెంబర్గా ఉన్నానని, తాజాగా జాతీయ సమన్వయకర్తగా ఎన్నికయ్యాయని డాక్టర్ కిరణ్ తెలిపారు.