TSPE | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): అంతర్గత విద్యుత్తు సమస్యలకు తమను బాధ్యులను చేయొద్దని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ (టీఎస్పీఈ జాక్) కోరింది. తమ తప్పిదాలు లేకు న్నా విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు, అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది లోపం అంటూ అసత్య ప్రచారం చేయడంపై జేఏసీ నేతలు మండిపడ్డారు.. సోమవారం హైదరాబాద్ మింట్కంపౌండ్లోని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ – 1104 కార్యాలయంలో జేఏసీ నేతలు మాట్లాడు తూ.. రాష్ట్రంలోని అన్ని క్యాటగిరీల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు అహర్నిశలు కృషిచేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో నిరుడు 15,497 ఉన్న గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ ఉన్నదని, ఈ ఏడాది ఇప్పటికే 15,623 మెగావాట్లకు చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిరంతర విద్యుత్తును అందించేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తామని చెప్పారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ జీ సాయిబాబు, కన్వీనర్ పీ రత్నాకర్రావు, కోకన్వీనర్ పీ బీసీరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.