హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ డీఈఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 5 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 21, 22 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని కన్వీనర్ జీ రమేశ్ తెలిపారు. వివరాల కోసం htpps://deecet.cdse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. టీజీపీఎస్సీ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మార్చి 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్ వెల్లడించింది.