హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): తపాలా విభాగంలో వివాదాల పరిష్కారానికి మార్చి 19న రాష్ట్ర స్థాయి డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోస్టల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 8లోపు పోస్టల్ విభాగంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ పోస్టల్ ప్రధాన కార్యాలయానికి లేఖ అందజేయాలని పేర్కొన్నారు.