ఎమ్మెల్సీ స్థానాల గెలుపుపై టీఆర్ఎస్ సంబురాలు
పల్లా రాజేశ్వర్రెడ్డి, విజయవాణీదేవికి శుభాకాంక్షలు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు
స్వీట్లు పంచి, పటాకులు కాల్చిన శ్రేణులు
దుబ్బాక టౌన్, మార్చి 20 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంపై దుబ్బాక టీఆర్ఎస్ శ్రేణులు శనివారం సాయంత్రం సంబురాలు జరుపుకున్నా రు. హైద్రాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో సురభివాణీదేవి, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేశారు. స్థానిక బస్స్టాం డ్ వద్ద పటాకులు కాల్చి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రొట్టె రాజమౌళి, మున్సిపల్ శాఖ అధ్యక్షుడు ఆసస్వామి మాట్లాడారు. ఈ విజయం ప్రతిపక్షాలకు చెంప పెట్టులాంటిందన్నారు. జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానంలో బీజేపీ స్థానం కోల్పోవడం టీఆర్ఎస్కు మరింత నైతిక బలాన్ని ఇచ్చిందన్నారు. పీవీ కూతురు వాణీదేవిని పెద్దల సభకు పంపి ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారన్నారు. సంబురాల్లో మండలాధ్యక్షుడు మల్లారెడ్డి, వైఎస్ ఎంపీపీ ఆస్క రవి, పీఏసీఎస్ చైర్మన్ కైలాస్, నాయకులు బండిరాజు, గన్నెభూంరెడ్డి, కిషన్రెడ్డి, శ్రీరాములు, పర్స కృష్ణ, బానాల శ్రీనివాస్, బాలకృష్ణ, సంజీవరెడ్డి, ఆకుల రమేశ్, నరేశ్, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
చేర్యాలలో సంబురాలు..
చేర్యాల, మార్చి 20 : చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని రాంపూర్ తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై శనివారం రాత్రి పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలకు పట్టభద్రులు చెంపచెల్లుమనే తీర్పునిచ్చారని, ఈ విజయంతో టీఆర్ఎస్కు మరింత బాధ్యత పెరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వరూపరాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, ఎంపీపీ కరుణాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, మండలాధ్యక్షుడు అనంతుల మల్లేశం, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పెడతల ఎల్లారెడ్డి, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వంగా చంద్రారెడ్డి, యూత్ మండలాధ్యక్షుడు తివారి దినేశ్, జిల్లా నాయకుడు శివగారి అంజయ్య, అంకుగారి శ్రీధర్రెడ్డి, మంచాల కొండయ్య, కౌన్సిలర్లు ఆడెపు నరేందర్, పచ్చిమడ్ల సతీశ్, కందుకూరి సిద్ధిలింగం, బండోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
స్వీట్లు పంచి.. పటాకులు కాల్చి..
గజ్వేల్ అర్బన్, మార్చి 20 : గజ్వేల్లో టీఆర్ఎస్ నాయకు లు సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏ ఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ, ఎంపీపీ అమరావతి, జ డ్పీటీసీ పంగ మల్లేశం, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్, పార్టీ మండలాధ్యక్షుడు బెండ మధు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు చంద్రమోహన్రెడ్డి తదితరులు ‘జై కేసీఆర్.. జై టీఆర్ఎస్’.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ పటాకులు కాల్చారు. సీఎం ఆలోచన సరళిని, తెలంగాణ అభివృద్ధిలో చూపుతున్న దార్శనికతను పట్టభద్రులంతా అర్థం చేసుకున్నారని ఈ సందర్భంగా నాయకులు అన్నారు. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించారన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చగలరన్నారు. జరుగబోయే నాగార్జునసాగర్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రహీం, ఏఎంసీ డైరెక్టర్లు అత్తెలి రవి, ప్రవీణ్, మతిన్, నాయకులు దుర్గాప్రసాద్, మల్లేశం, రమేశ్గౌడ్, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.