మహబూబ్నగర్ : కరోనా కష్టకాలంలో కష్టపడి పంట పండించిన రైతులు ఇబ్బందులు పడకుండా వారి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డా.సి.లక్ష్మా రెడ్డి అన్నారు. జడ్చర్ల పట్టణంలోని అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్ (గంజి) లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయాన మాట్లాడారు. రైతులంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు వెంటనే పూర్తి అయ్యేలా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్లోనే కరోనా గర్భిణి ప్రసవం
సీఎం కేసీఆర్ వెంటే మంథని ప్రజలు
హ్యాట్సాఫ్ కోహ్లి.. ఐపీఎల్ వాయిదా పడగానే కొవిడ్ సహాయక చర్యల్లో కెప్టెన్
అజిత్ సింగ్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం