భువనగిరి టౌన్ : స్వాతంత్ర సముపార్జన కోసం తమ ప్రా ణాలను తృణ ప్రాయంగా వదిలేసిన మహనీయులను ఆద ర్శంగా తీసుకుని దేశ సమగ్రత కోసం యువత పాటుపడా లని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజ న క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం భువనగిరి పట్టణం లోని బాలుర జూనియర్ కళాశాల నుంచి పాత బస్టాండ్ వ రకు నిర్వహించిన ఫ్రీడం రన్ను ఆమె డీసీపీ నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించి మాట్లాడుతూ స్వాతంత్య్రం వ చ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో యువతలో దేశ భక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో 75 వారాల పాటు ఉ త్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో భాగంగానే ఫ్రీడం రన్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్రం కోసం మహానీయులు చేసిన త్యా గాలు ఎన్నటికీ వృధా కావన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడు తూ భావితరాలకు స్వేచ్ఛనందించాలనే ఉద్దేశంతో తమ ప్రాణాలను లెక్క చేయకుండా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉండాలన్నారు.
స్వాతం త్య్రం రాకముందు పరిస్థితులు, వచ్చిన తరువాత పరిస్థితు లను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంత రం కొవిడ్ తర్వాత ఆఫ్రికాలోని కిలిమంజోరో పర్వతాన్ని అధిరోహించిన పడమటి అన్వితారెడ్డిని శాలువాతో సత్క రించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ ఎం.ఉపేందర్రెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్, శాంతి ట్రాక్ క్లబ్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాం సుం దర్, శాంతి ట్రాక్ క్లబ్ సెక్రటరీ బోదాసు పాండు, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కోనేటి గోపాల్, తైక్వాం డో అసోసియేషన్ సభ్యులు శ్రీ కాంత్, రాధ, సీనియర్ క్రీడాకా రులు చింతల శంకర్, అయిల య్య, తన్నీరులింగస్వామి, రాజు, మల్లికార్జున్, యువజన సంఘా ల అధ్యక్షుడు కరుణ్, వాకర్స్ అ సోసియేషన్ సభ్యులు, విద్యార్థు లు, సిబ్బంది పాల్గొన్నారు.