జోగులాంబ గద్వాల : ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను ( Promises ) అమలు చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ( MLA Vijayudu ) ఆరోపించారు. గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనను నిరసిస్తూ మహిళలు, దివ్యాంగుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులు,వికలాంగులు, మహిళలకు రూ. 2500, కేసిఆర్ కిట్టు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ (తులం బంగారం), విద్యార్థులకు స్కూటీ హామీలు మరిచిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుడు బాసు హనుమంతు నాయుడు వంటవార్పు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాట ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు నెరవేర్చడం లేదని ఆరోపించారు.