హైదరాబాద్, ఫిబ్రవరి3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వక్ఫ్ భూములను కాపాడాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని సీఎం రేవంత్రెడ్డికి మైనార్టీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్రెడ్డి, వివిధ జిల్లాల మైనార్టీ ప్రతినిధులతో సీఎం శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మైనార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు జరిగేలా చూడాలని, మైనార్టీ పాఠశాలల అభివృద్ధికి తగిన బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఆయా విషయాలపై సీఎం సానుకూలంగా స్పందించారు.