హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో చికెన్ ధరలు కొండెకాయి. కొన్నిచోట్ల కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతున్నది. ఏటా మహాశివరాత్రి తర్వాత మొదలు కావాల్సిన ఎండలు, ఈసారి ఫిబ్రవరి రెండోవారం నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో వేడికి కోళ్లు చనిపోతున్నాయి. మరో పక బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నదని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
మేడారం మహాజాతర నేపథ్యంలో కోళ్ల దిగుమతిపై తీవ్ర ప్రభావం చూపింది. నష్టాల భయంతో పౌల్ట్రీ వ్యాపారులు కోళ్ల పెంపకాన్ని చాలా వరకు తగ్గించారు. గిట్టుబాటు కాక తల్లికోళ్లను కూడా అమ్మేశారు. ఫలితంగా ఉత్పత్తి తగ్గి, కోళ్లకు కొరత ఏర్పడింది. గత బుధ, గురువారాల్లో కిలో లైవ్ కోడి రూ.150 నుంచి రూ.200 ఉండగా.. ఆది, సోమ వారాల్లో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం కిలో సిన్లెస్ చికెన్ రూ.300, సిన్తో రూ.260 వరకు అమ్ముతున్నారు. ఇక బోన్లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కుపైగా విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్గా మారి ఇష్టారీతిన ధరలను నిర్ణయించేస్తున్నారు. కోడిగుడ్డు ధర కూడా రిటేల్ మార్కెట్లో ఒకోటి రూ.6 పైనే పలుకుతున్నది. పెరిగిన ధరల దృష్ట్యా కొందరు చిల్లర వ్యాపారులు ఇదే అదనుగా.. ఒకో గుడ్డు రూ.8 వరకు విక్రయిస్తున్నారు.