నాంపల్లి కోర్టులు, జూన్ 27 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దొడ్డ శివారెడ్డిని జూలై 10 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నిందితుడు అమీర్పేటలో కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాడు. ప్రశ్నపత్రాల జవాబులను అందించేందుకు శివారెడ్డితో పూల రమేశ్ (ఏఈ) డీల్ కుదుర్చుకున్నాడు. తొలుత 50 వేలు, తర్వాత 1.50 లక్షల ను శివారెడ్డిని కలిసి మహ్మద్ ఖాలీద్ ఇచ్చాడు. సోదరులు పూల రవికిశోర్, రమేశ్, మహ్మద్ ఖాలీద్తో కలిసి చాట్ జీపీటీ ద్వారా జవాబులను అందించా రు. సిట్ అధికారులు నిందితుడిని చం చల్గూడ జైలుకు తరలించారు. కాగా, సోదరులు పూల రమేశ్, రవికిశోర్, అన్న విక్రమ్, చెల్లెలు రాయపురం దివ్య, ధనావత్ భరత్నాయక్, గాదె సాయిమధు, గుగులోత్ శ్రీనునాయక్, వదితీ నరేశ్, లోకిని సతీశ్కుమార్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. మహ్మద్ ఖాలీద్ తరఫున వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.