లక్నో: ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగిన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో నిరాశ పరిచింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి పోరులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఓడింది. మొదట భారత్ 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (50) అర్ధశతకం సాధించగా.. హర్మన్ప్రీత్ కౌర్ (40) రాణించింది. అనంతరం లక్ష్యఛేదనలో ఓపెనర్లు లిజెల్లీ లీ (83 నాటౌట్), లౌర్ వాల్వార్ట్ (80) దుమ్మురేపడంతో దక్షిణాఫ్రికా 40.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసి నెగ్గింది.