హైదరాబాద్ : రైల్వే ప్రయాణికులకు అదనపు సౌకర్యం కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే రెండు కీలక నిర్ణయాలు (Key Decisions) తీసుకుంది. అందులో భాగంగా రెండు ఎక్స్ప్రెస్ రైళ్ల(Express Trains) కు సంబంధించిన టెర్మినళ్లలో మార్పులు చేస్తూ గురువారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ముఖ్యంగా సికింద్రాబాద్ (Secundrabad) రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంలో భాగంగా దేవగిరి(Devagiri), అజంతా (Ajanta) ఎక్స్ప్రెస్ రైళ్ల టెర్మినళ్లలో మార్పులు తీసుకువచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలు దేరాల్సిన దేవగిరి ఎక్స్ప్రెస్ రైలును లింగంపల్లి నుంచి బయలు దేరుతుందన్నారు.
సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించాల్సిన అజంతా ఎక్స్ప్రెస్ కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు కొనసాగించనున్నట్లు వెల్లడించారు. మారిన టెర్మినళ్లు దేవగిరి ఎక్స్ప్రెస్ ఈ నెల 14 నుంచి, అజంతా ఎక్స్ప్రెస్ ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయని వివరించారు.