Bodhan | బోధన్ రూరల్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని ఏటా నిర్వహించే పిడిగుద్దులాటను ఈ ఏడాది కూడా నిర్వహించారు. సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో గ్రామస్థులు రెండు గ్రూపులుగా విడిపోయి హనుమాన్ మందిరం వద్దకు చేరుకొన్నారు. అడ్డంగా కట్టిన తాడుకు రెండు వైపులా నిల్చొని ముఖాలు, వీపులపై పిడుగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఆట సుమారు 5 నిమిషాలపాటు కొనసాగింది.