హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): మత్స్య సంపదకు సవాల్ గా మారిన క్యాట్షిష్ల ఉనికిని తక్కువ ఖర్చులోనే గుర్తించేందుకు సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ సంస్థ నూ తన విధానాన్ని అభివృద్ధి చేసింది. నీటి వనరుల్లోని నీరు, అడుగున చేరిన మట్టితో ఎన్విరాన్మెంటల్ డీఎన్ఏ (ఈ-డీఎన్ఏ)ను రూ పొందిస్తే.. దాని సాయంతో క్యాట్ఫిష్ జాడ బయటపడుతుందని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త జీ ఉమాపతి పేర్కొన్నారు.
ఆఫ్రికా, బం గ్లాదేశ్ ప్రాంతాలకు పరిమితమైన ప్రమాదకర క్యాట్ఫిష్ స్థానిక జలచరాలకు సమస్యగా మారింది. వీటి పెంపకంపై దేశవ్యాప్తంగా నిషే ధం అమల్లో ఉన్నది. అయినా, అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా వీటిని పెంచుతున్నారు. కొర్రమీనును పోలినట్టుండే క్యాట్ఫిష్లను కొర్రమీను పేరుతోనే తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. వీటిలో ఉండే ఒమేగా ఫ్యాటీ 6 ఆమ్లాలతో న రాలు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ ము ప్పు పొంచి ఉన్నదని పలు పరిశోధనల్లోనూ తేలింది. తెలంగాణలో చెరువులు, కుంటలు మత్స్య సంపదకు కేంద్రాలుగా మారాయి. చెరువుల్లోకి చేరిన క్యాట్ఫిష్లను గుర్తించేందుకు ఈ-డీఎన్ఏ విధానం సాయపడుతుందని సీసీఎంబీ వర్గాలు భావిస్తున్నాయి.