హైదరాబాద్,ఆగస్టు 5, (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ద్వారా విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏకపక్షంగా ఆదేశించడం సరికాదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్ కుమార్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేఆర్ఎంబీ రెండు రాష్ట్రాల ప్రయోజనాలను సమానంగా చూడాల్సింది పోయి, ఏపీ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడం సమర్థనీయం కాదని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తప్పుబట్టారు.
తెలంగాణకు దకాల్సిన న్యాయబద్ధమైన నీటిని ఈ నెల 14వ తేదీలోగా విడుదల చేయాలని, లేదంటే బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా కోదాడ నుంచి హాలియా వరకు వేలాది మంది రైతులతో కలిసి పాదయాత్ర చేపడుతారని ఆయన స్పష్టం చేశారు. అక్రమ నీటి తరలింపుపై సీఎం తక్షణమే స్పందించి కేంద్రానికి, కేఆర్ఎంబీకి లేఖ రాయాలని కోరారు.