హైదరాబాద్: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దీన్పై 17 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గోపీనాథ్ గెలిచారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.