హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాలశాఖలో జూనియర్ అసిస్టెంట్ యేముల నితిన్ ఆఫ్రికాలోనే అత్యంత ఎత్తయిన కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించారు. 75వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 7.30 గంటలకు 19,314 అడుగుల ఎత్తయిన పర్వతంపై ఆయన 75 అడుగుల భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ అరుదైన ఫీట్ను సాధించిన నితిన్కు ఐ అండ్ పీఆర్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.