భద్రాచలం, జూలై 24: ఆంధ్రప్రదేశ్లో విలీనమైన ఎటపాక, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన భద్రాచల పట్టణంలో ఐదు విలీన గ్రామస్థులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
ఐదు పంచాయతీలు తెలంగాణలో కలిపితేనే భద్రాచలం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే భద్రాచలం ఏకాకిగా మిగిలిపోయిందని తెలిపారు. ఈ ఆందోళనలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులతోపాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.