మహబూబాబాద్ : జిల్లాలోని నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో శుక్రవారం తొడేళ్ల దాడిలో 10 గొర్రెలు మృతి చెందాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉదారి వెంకన్న సీఎం కేసీఆర్ అందించిన గొర్రెలు కాసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఆర్ధరాత్రి మందపై తొడేళ్లు దాడి చేయడంతో 10 గొర్రెలు మృతి చెందాయి. రెండు నెలలుగా గ్రామంలో దుడ్డెల మల్లమ్మకు చెందిన 20 గొర్రె పోతులు సైతం తోడేళ్ల దాడిలో బలయ్యాయి. రెండు సార్లు గొర్రెల మృతికి కుక్కల దాడిగా భావించినప్పటికీ తోడేళ్లు మాత్రమే రక్తం తాగుతాయని, కుక్కలైతే మాంసం తింటాయని గొర్రెల కాపారులు చెబుతున్నారు. అటవీశాఖాధికారులు స్పందించి తొడేళ్ల బారి నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.