హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ప్రమోషన్లలో బీసీ ఉద్యోగాలకూ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు డిమాండ్చేశారు. ‘ఓబీసీ రిజర్వేషన్ల అమలు తీరు-తెన్నులు’ అనే అంశంపై జాతీయ ఓబీసీ ఉద్యోగ సంఘాల సమాఖ్య, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన సెమినార్లో వకుళాభరణం మాట్లాడుతూ కేంద్ర విద్య, ఉద్యోగ సంస్థల్లో అమలుచేస్తున్న 27%రిజర్వేషన్లు ఇప్పటివరకు ఏటా కనీసం 15% అభ్యర్థులకు కూడా లభించడం లేదని వెల్లడించారు. దీంతో బ్యాక్ లాగ్ విధానం ద్వారా స్పెషల్ డ్రైవ్లతో నియామకాలు చేపట్టాలని కోరారు.సామాజిక, ఆర్థిక కులగణన- 2011 వివరాలను రాష్ర్టాలవారీగా వెల్లడించాలని కోరారు.