హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం దరఖాస్తు గడువును మార్చి 8 వరకు పొడిగించినట్టు బీసీ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ పథకం కింద ఎంపికైన బీసీ విద్యార్థులకు విదేశీ చదువుల కోసం ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నది. విద్యార్థులు https:// telang anaepass.cgg.gov.in నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.