పోస్టర్ను ఆవిష్కరించిన ఉద్యోగ సంఘాల నేతలు
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): వచ్చే 12న నాంపల్లిలోని గెజిటెడ్ భవన్లో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్టు తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీ మమత, ఏ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పండుగ పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా మమత మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నలుమూలలా చాటే బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు సుజాత, సబి త, విజయలక్ష్మి, శిరీష, జ్యోతి, శ్రీలీల, స్వరూపారాణి, డాక్టర్ అమరావతి, లావ ణ్య, రేవతి, డాక్టర్ అనిత, కవిత, బీ మాధురి, సంగీత, శారద, రేణుక, పూ నం, దుర్గ తదితరులు పాల్గొన్నారు.