హైదరాబాద్ : నిజామాబాద్(Nizamabad )లోక్సభ నియోజకవర్గానికి భారత రాష్ట్ర సమితి(BRS) అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్(Bajireddy Govardhan) శుక్రవారం నామినేషన్(Nomination) దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతుకు రెండు సెట్ల నామినేషన్లు అందించారు. బాజిరెడ్డి వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేష్ గుప్తా, నిజామాబాద్, జగిత్యాల జడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు.