వికారాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా అనంతగిరికి 50 పడకల సమీకృత ఆయుష్ దవాఖాన మంజూరైందని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. అనంతగిరిలో ఆయుష్ దవాఖాన ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారా? అని శుక్రవారం లోక్సభలో ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
జాతీయ ఆయుష్ మిషన్ (నామ్) కింద అనంతగిరికి ఈ దవాఖాన మంజూరైందని మంత్రి తెలిపారు. దీనికోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి రూ.7.57 కోట్లలో తొలి విడత కింద రూ.6 కోట్ల విడుదలకు అంగీకారం తెలిపాయని వివరించారు.