కేంద్రం వైఖరికి నిరసనగా నిరవధిక ఆందోళన
హిమాయత్నగర్, ఏప్రిల్ 3: ఆటో కార్మికులను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 రోడ్ సేఫ్టీ బిల్లును రద్దు చేయాలనే డిమాండ్తో ఈ నెల 11 నుంచి నిరవధికంగా ఆటోల బంద్ చేపట్టనున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్, ఐఎఫ్టీయూ నాయకుడు కిరణ్, టీఏటీఎస్ నేత సత్తిరెడ్డి చెప్పారు.
ఆదివారం హైదర్గూడలో వారు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం రోడ్ సేఫ్టీ బిల్లు ద్వారా ఆటోలకు ఫి ట్నెస్ చేయించడంలో ఆలస్యమైదనే కారణంతో రవాణాశాఖ అధికారులు జరిమానాలు విధిస్తున్నారని అ న్నారు. ఆటో కార్మికులు జరిమానా కట్టేందుకు ఉన్న వాహనాలను విక్రయించే దుస్థితి వచ్చిందన్నారు. కేం ద్రం ఆటో డ్రైవర్ల డిమాండ్లను పరిష్కరించేతవరకు బంద్ చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో ఆటో జేఏసీ నేతలు లక్ష్మీనర్సయ్య, మహ్మద్ అజీముద్దీన్, మీర్జా రఫతుల్లా, ఎస్కే మాము పాల్గొన్నారు.