స్టేషన్ ఘన్పూర్, జూలై 29: మాదిగ జాతిని కించపరిచిన ఈటల రాజేందర్ బావ మరిది మధుసూదన్రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. దళిత బంధు పథకాన్ని అడ్డుకుంటే దళితులు ఉరికించి కొడతారని హెచ్చరించారు. గురువారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దళితుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా గత బడ్జెట్లో దళితబంధును ప్రకటించారని, అప్పుడు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ఇప్పుడు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.