హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు గ్రామ శివాలయంలో ఇనుపయుగపు ఆనవాళ్లను పురావస్తు పరిశోధకుడు, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్, కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మంగళవారం పరిశీలించారు. గ్రామానికి తూర్పున శంకరరా జా పొలంలో క్రీ.పూ. 1,000 సంవత్సరాలకు చెందిన ఇనుప యుగపు రాకాసిగుళ్లను గుర్తించారు. అక్కడ క్రీ.శ. 11-12 శతాబ్దికి చెందిన గణేశ, గరుడ, శివలింగం, మహిశాసురమర్ధిని శిల్పాన్ని పరిశీలించారు.