హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రిసెర్చ్ అంశాల్లో పరస్పర సహకారంపై పోలీస్శాఖతో అనురాగ్ యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకున్నది. డీజీపీ కార్యాలయంలో జరిగిన ఎంవోయూపై డీజీపీ ఎం మహేందర్రెడ్డి, అనురాగ్ వర్సిటీ ప్రతినిధి సమీన్ఫాతిమా సంతకాలు చేశారు. సైబర్నేర భద్రత, అవలంబించాల్సి విధానాలు, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వర్సిటీ, పోలీస్శాఖ పరస్పరం సహకరించుకోనున్నాయి. కార్యక్రమంలో అనురాగ్ వర్సిటీ వీసీ రామచంద్రన్, సీఈవో నీలిమ, మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతిలక్రా పాల్గొన్నారు.