నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 17: గౌడ, ఎస్సీ, ఎస్టీ కులస్థులకు బార్లు, వైన్స్ల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. శుక్రవారం ఆయా కుల సం ఘాల నాయకులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యం లో రాష్ట్రంలో సువర్ణాధ్యాయం మొదలైందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో కుల వృత్తులకు పూర్వవైభవం వచ్చిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జై గౌడ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. హైదరాబాద్లోని రాంనగర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నేత టీ సోమసుందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్, గౌడ సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఫ్లెక్సీలకు గౌడ సంఘం ఆధ్వర్యంలో, హుస్నాబాద్ మం డలం పొట్లపల్లిలో క్షీరాభిషేకం చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి గౌడ, ఎస్సీ, ఎస్టీ కులస్థులు క్షీరాభిషే కం నిర్వహించారు. మెదక్లో పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు కృష్ణాగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ లక్ష్మీనారాయణగౌడ్తో కలిసి మున్సిపల్ వైస్చైర్మన్ మల్లికార్జున్గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.