హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): అసిస్టింట్ ఇంజినీర్(ఏఈ) పరీక్ష తేదీని మార్చినట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. తొలుత ఫిబ్రవరి 12న నిర్వహిస్తామన్న ఏఈ పరీక్షను మార్చి 5కి మార్చామని వెల్లడించారు. ఫిబ్రవరి 12న గేట్ పరీక్ష ఉన్నందున ఈ నిర్ణయం తీసుకొన్నామని వెల్లడించారు. వివరాలకు https:// www.tspsc.gov.inలో సంప్రదించాలని సూచించారు.