వనస్థలిపురం, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్రెడ్డిని శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు హస్తినాపురంలోని షిర్డీసాయినగర్కాలనీలో ఉన్న ఆయన నివాసంతోపాటు వివిధ ప్రాంతాల్లోని ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లపై ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆదాయనికి మించి అక్రమ ఆస్తులు సంపాదించినట్టు అందిన సమాచారం మేరకు తహసీల్దార్ ఇంటిపై దాడులు జరిపినట్టు అధికారులు తెలిపారు. మహేందర్రెడ్డి ఇంట్లో రూ.2 కోట్ల 7లక్షల నగదుతో పాటు రూ.4,56,66,660 విలువ చేసే స్థిర, చర ఆస్తులను సీజ్ చేసినట్టు వెల్లడించారు. అనంతరం మహేందర్రెడ్డిని అరెస్టు చేసి, ఏసీబీ మొదటి అదనపు ప్రత్యేక జడ్జి ముందు హాజరుపరిచినట్టు వెల్లడించారు.