హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నిర్వహించిన 16వ ఆలిండియా బ్యాడ్మింటన్ పోటీల్లో మన పోలీసులు సత్తా చాటారు. తెలంగాణ పోలీసు అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న గంటా వెంకట్రావు 55 ఏండ్లు పైబడిన వారి విభాగంలో రెండు కాంస్య పతకాలను గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయనను అకాడమీ డైరెక్టర్, ఏడీజీ అభిలాష బిస్త్ అభినందించారు. కాగా, 2017లో కేరళలో జరిగిన ఆలిండియా పోలీస్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో వెంకట్రావు గోల్డ్ మెడట్ గెలుచుకున్నారు.