శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన మూడు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు, పుల్వామా ఎన్కౌంటర్లో మరో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఎల్వోసీ వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, ఇద్దరు సైనికులు అమరులయ్యారు.