హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన 10 మంది స్టేట్ సర్వీస్ అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. ఐఏఎస్ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించగా, గతనెలలో ఇంటర్వ్యూల అనంతరం యూపీఎస్సీ 10 మందిని ఎంపిక చేసింది. వీరికి ఐఏఎస్ హోదా కల్పిస్తూ త్వరలో గెజిట్ జారీ చేయనున్నారు. వీరిలో జల్ద అరుణశ్రీ, ఏ నిర్మల కాంతి వెస్లీ, కోట శ్రీవాత్సవ, చెకా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్, కోరం అశోక్రెడ్డి, కే హరిత, వెంకట నర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్ నికోలస్ ఉన్నారు.
గ్రూప్ -1 అధికారుల సంఘం హర్షం
నాన్ రెవెన్యూ కోటాలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడంపై గ్రూప్-1 అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. 9 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతులు సీఎం కేసీఆర్ చొరవ వల్ల సాకారం అయ్యాయని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, హన్మంత్నాయక్ తెలిపారు.
పదోన్నతులు పొందింది వీరే..
1 కోరెం అశోక్రెడ్డి: స్వస్థలం కరీంనగర్ కాగా, సహకారశాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నారు.
2 వెంకట నర్సింహారెడ్డి: సిద్దిపేట జిల్లాకు చెందిన ఈయన సహకారశాఖలో అదనపు డైరెక్టర్గా పనిచేసి ప్రస్తుతం టీఎస్ఐఐసీ ఎండీగా పనిచేస్తున్నారు.
3 నవీన్ నికోలస్: సంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ గిరిజన సంక్షేమశాఖలో సేవలందించారు. డిప్యుటేషన్పై కేంద్ర విద్యాశాఖలోఢిల్లీలో పనిచేస్తున్నారు.
4 కాత్యాయని : స్వస్థలం హైదరాబాద్. పంచాయతీరాజ్ విభాగంలో పనిచేస్తూ ప్రస్తుతం జడ్పీ సీఈవో హోదాలో సేవలందిస్తున్నారు.
5 నిర్మలా కాంతి వెస్లీ: దివంగత ఐపీఎస్ అధికారి వెస్లీ సతీమణి. స్వస్థలం హైదరాబాద్. 2010లో గ్రూప్-1 అధికారిగా రెవెన్యూశాఖలో విధుల్లో చేరిన కాంతి వెస్లీ, ప్రస్తుతం స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా పనిచేస్తున్నారు.
6 కే హరిత : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈమె 1996లో గ్రూప్-1కు ఎంపికయ్యారు. ప్రస్తుతం అదనపు కమిషనర్గా, ఎకనమిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇన్చార్జిగా, ఈవోడీబీ నోడల్ ఆఫీసర్గా సేవలందిస్తున్నారు.
7 కోట శ్రీవాత్సవ : దివంగత ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ కుమారుడు. హైదరాబాద్ జిల్లాలో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా, జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు.
8 జల్ద అరుణశ్రీ : స్వస్థలం జగిత్యాల. టీచర్ ఉద్యోగం చేస్తూ గ్రూప్-1కు ఎంపికయ్యారు. డీఆర్డీఏ పీడీగా, జగిత్యాల జిల్లా డీఆర్వో, అదనపు కలెక్టర్గా పనిచేశారు. ఇటీవల బదిలీ కాగా పోస్టింగ్ ఇవ్వలేదు.
9 చెక్కా ప్రియాంక : వరంగల్ నిట్లో అభ్యసించిన ఈమె పలు జిల్లాల్లో జడ్పీ సీఈవోగా పనిచేశారు.
10 బడుగు చంద్రశేఖర్: ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు.
ఐఏఎస్ హోదాపై హర్షం
ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్ హోదా దక్కడంపై తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంతునాయక్ హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్లుగా పెండింగ్లో ఉన్న అంశాన్ని సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని పరిష్కరించడం సంతోషకరమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.