ముచ్చట గొలిపే వన్నెలు, మిరుమిట్లు పంచే అందాలతో హొయలు పోయే సైబీరియన్ పక్షులు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం బూరుగుమళ్ల గ్రామంలో కొద్ది రోజులుగా సందడిచేస్తున్నాయి. తెలుపు, నలుపు, ఎరుపు వర్ణాలతో అందంగా ఉండే సైబీరియన్ పక్షులు ఏటా తమ గ్రామానికి వచ్చే విదేశీ అతిథులని స్థానికులు చెప్తున్నారు. గుడ్లు పెట్టే సమయానికి ఈ గ్రామానికి వందల సంఖ్యలో వచ్చే బహుదూరపు బాటసారులైన సైబీరియన్ పక్షులు ఇక్కడి చెట్లపై నివాసాలను ఏర్పాటుచేసుకొని గుడ్లు పెట్టి పొదగడంతోపాటు పిల్లలు పెద్దవై స్వతహాగా ఎగిరే దశకు చేరుకోగానే స్వస్థలాలకు ఎగిరిపోవడం ఆనవాయితీగా వస్తున్నది.