హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : దిశ కేసును సెషన్స్ కోర్టుకు నివేదించాలని శంషాబాద్ పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది శ్రీరఘురామ్ హైకోర్టులో వాదనలు వినిపించారు. దిశ ఎన్కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సీజే జస్టీస్ ఉజ్జల్ భూయాన్, జస్టీస్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. శంషాబాద్ ఎస్హెచ్వో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై న్యాయవాది శ్రీరఘురామ్ వాదించారు. దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనలో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ నివేదికతో విబేధిస్తున్నట్టు చెప్పారు.
దిశ ఎన్కౌంటర్లో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పూరర్ కమిషన్ నివేదిక కేవలం సిఫారసు మాత్రమేనని, అదేమీ న్యాయపరమైన ప్రామాణిక నివేదిక కాబోదని తెలిపారు. కమిషన్ ఎంతో శ్రమించి ఇచ్చిన నివేదికను కాదంటే ఎలాగని హైకోర్టు ప్రశ్నించింది. దిశ తండ్రి తరఫు సీనియర్ న్యాయవాది కే వివేక్రెడ్డి వాదనలు వినిపిస్తూ, సుప్రీంకోర్టు నియమించిన జస్టీస్ సిర్పూరర్ కమిషన్ దిశను నిందితులే హత్య చేశారనేందుకు ఆధారాలు ల్లేవని తేల్చేడం అన్యాయమన్నారు. తదుపరి విచారణను ధర్మాసనం ఏప్రిల్ 12కి వాయిదా వేసింది.