మఠంపల్లి: కృష్ణా నది తీరాన వెలసిన మండలంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం అర్చకులు నిత్య కల్యాణం కన్నుల పండువగా నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం చేశారు.
పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణతంతు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్, అర్చకులు,భక్తులు పాల్గొన్నారు.