అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఇవాళ కొత్తగా 1,288 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 610 మంది కోలుకున్నారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 9,04,548కి చేరింది. 8,88,508 మంది చికిత్సకు కోలుకున్నారు.
మరో 8,815 యాక్టివ్ కేసులుండగా నేటివరకు 7,225 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 31,116 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి