IND vs ENG 4th Test : వైజాగ్, రాజ్కోట్ టెస్టుల్లో ఇంగ్లండ్ భరతం పట్టిన భారత జట్టు(Team India) రాంచీ టెస్టులో తడబడింది. టాపార్డర్తో పాటు మిడిలార్డర్ వైఫల్యంతో ఆలౌట్ ప్రమాదంలో పడింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(73) హాఫ్ సెంచరీతో కదం తొక్కినా మిగతా వాళ్లు చేతులెత్తేశారు. చివర్లో ధ్రువ్ జురెల్(30 నాటౌట్), కుల్దీప్ యాదవ్(17 నాటౌట్) అద్భుత పోరాటంతో జట్టును ఆదుకున్నారు.
దాంతో, రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 219 రన్స్ చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్లో రోహిత్ సేన 134 పరుగులు వెనకబడి ఉంది. ఇంగ్లండ్ యువ స్పిన్నర్లు షోయబ్ బషీర్ నాలుగు, టామ్ హర్ట్లే రెండు వికెట్లు పడగొట్టారు.
Shoaib Bashir’s best day in cricket so far, but Jurel and Kuldeep stopped England’s charge in the last hour #INDvENG
▶️ https://t.co/N9hKxN5o8f pic.twitter.com/UzHhZjj6i6
— ESPNcricinfo (@ESPNcricinfo) February 24, 2024
రెండో రోజు తొలి సెషన్లోనే ఇంగ్లండ్ను ఆలౌట్ చేసిన భారత్కు ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఇన్నింగ్స్ మొదలెట్టిన కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ(2)ను అండర్సన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత యశస్వీ(73), శుభ్మన్ గిల్(38) ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే.. బషీర్ సూపర్ డెలివరీతో గిల్ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే రజత్ పాటిదార్(17), రవీంద్ర జడేజా(12)లు ఔటయ్యారు.
Stumps on Day 2 in Ranchi!
A valuable unbeaten partnership between Dhruv Jurel and Kuldeep Yadav helps #TeamIndia move to 219/7 👏
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/fhnl0yrMbP
— BCCI (@BCCI) February 24, 2024
సెంచరీ దిశగా దూసుకెళ్తున్న జైస్వాల్ను బౌల్డ్ చేసిన బషీర్ భారత్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రాజ్కోట్ టెస్టులో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్(14), రవిచంద్రన్ అశ్విన్(1)లు స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. దాంతో, రెండో రోజే టీమిండియా ఆలౌట్ అయ్యేలా కనిపించింది. 177 పరుగులకే ఏడు వికెట్లు పడిన సమయంలో జురెల్, కుల్దీప్లు పట్టుదలగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఎనిమిదో వికెట్కు 42 పరుగులు జోడించారు. మూడో రోజు వీళ్లిద్దరూ ఎంత సేపు ఆడుతారు? ఇంగ్లండ్కు ఎంత ఆధిక్యం వస్తుంది? అనేది చూడాలి.
2⃣0⃣0⃣ up for #TeamIndia, with Dhruv Jurel and Kuldeep Yadav in the middle!
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/gX76oqIuDo
— BCCI (@BCCI) February 24, 2024
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్ను అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ వణికించాడు. అతడి దెబ్బకు 112 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను రూట్ ఆదుకున్నాడు. బెన్ ఫోక్స్(47), రాబిన్సన్(58)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఓవర్నైట్ స్కోర్ 302/7తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ మరో 53 పరుగులు జోడించింది. పేసర్ ఓలీ రాబిన్సన్(58) కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ బాదగా.. జో రూట్(122) నాటౌట్గా నిలిచాడు. జడేజా 4 వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌటయ్యింది.