ఓస్లో (నార్వే): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో సంచలనాత్మక ప్రదర్శనతో సెమీఫైనల్కు దూసుకెళ్లిన పింకీ (55 కిలోలు) తృటిలో చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది. నార్వేలోని ఓస్లో వేదికగా సోమవారం జరిగిన సెమీస్లో పింకీ 6-8 తేడాతో జర్మనీ రెజ్లర్ నీనా హెమ్మర్ చేతిలో పోరాడి ఓడింది. కడదాకా హోరాహోరీగా సాగిన పోరులో ఇద్దరు రెజ్లర్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. 0-4తో వెనుకంజలో ఉన్న పింకీ ఒక్కసారిగా పుంజుకుని పోటీలోకి వచ్చింది. జర్మనీ రెజ్లర్పై పట్టు సాధించే ప్రయత్నంలో కింద పడేయడంతో ఈ యువ రెజ్లర్ రెండు పాయింట్లు తన ఖాతాలో వేసుకుంది. నిమిషానికి పైగా హెమ్మర్ను ఊపిరి సలుపకుండా చేసినా.. రిఫరీలు పింకీకి పాయింట్లు ఇవ్వలేదు. అయినా వెనుకకు తగ్గని పింకీ 6-4తో ఆధిక్యంలోకి వచ్చినా..ఆఖర్లో హెమ్మర్ రెండేసి సార్లు రెండు పాయింట్లు దక్కించుకోవడంతో ఓటమి వైపు నిలువాల్సి వచ్చింది. మరోవైపు పురుషుల 55కిలోల కాంస్య పోరులో రోహిత్.. తుల్గా తుముర్
(మంగోలియా) చేతిలో ఓడి నిరాశ పరిచాడు.